CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉సింగరేణి ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ ఐ‌ఏ‌ఎస్ జి‌ఎంల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష.

Share it:

 


 భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 6 (మన్యం టీవీ) సింగరేణి సి&ఎం‌డి ఎన్ శ్రీధర్ , ఐ‌ఏ‌ఎస్ సొమవారం నాడు అన్ని ఏరియాల జి‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా సింగరేణి డైరక్టర్ ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్ కొత్తగూడెం ఏరియా నుండి ఈ వీడియోకాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ లో కొత్తగూడెం ఏరియా జి‌ఎం సి‌హెచ్.నరసింహా రావు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సింగరేణి సంస్థ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ ఎన్‌.శ్రీధర్‌ నూతనముగా చేపట్టే ప్రాజెక్టులయిన జేవీఆర్‌ ఓసి-2 ఎక్స్‌టెన్షన్‌ మరియు పెనగడప ఓసీ ల గురించి సమీక్షించి గనులకు సంబంధించిన మిగిలిన అనుమతులను వేగవంతం చేయాలని, అన్ని అనుమతుల తర్వాత సకాలంలో ఈ గనుల నుండి ఉత్పత్తి ప్రారంభించేలా చూడాలన్నారు. ఈ సమీక్షలో సింగరేణి డైరక్టర్ ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్ తో పాటు ఏరియా జి‌ఎం సి‌హెచ్ నరసింహ రావు, ఎస్‌ఓటుడైరక్టర్ దేవి కుమార్, ఎస్‌ఓటు జి‌ఎం రమేష్, ఏరియా ఇంజనీర్ రఘు రామ రెడ్డి, డి‌జి‌ఎం లు ఆంజనేయ చెట్టి, సూర్యనారాయణ, సదానందం, ఉజ్వల్ కుమార్ బెహ్రా మరియు సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ డి.రమణా రెడ్డి పాల్గొన్నారు.

 

 

డిజి‌ఎం పర్సనల్, కొత్తగూడెం ఏరియా

Share it:

Post A Comment: