పనిలేని ప్రతిపక్షాలు విమర్శలు తప్ప ఏమీ చేయలేవు
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే పలు విమర్శలు
వంద పడకల ఆసుపత్రికి పూర్తిస్థాయిలో వైద్యుల నియామకం పట్ల సంతోషం వ్యక్తం.
ప్రభుత్వ విప్ రేగా, ముఖ్యమంత్రి కేసిఆర్ లకు కృతజ్ఞతలు తెలిపిన మణుగూరు మండల ప్రజా ప్రతినిధులు
మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలో, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యుల నియామకం జరగడం పట్ల మణుగూరు మండల జడ్పిటిసి పోశం నరసింహారావు మొదటగా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లకు, మీడియా సాక్షిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 8 సంవత్సరాల క్రితం రేగా కాంతారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేయడం జరిగిందని, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పూర్తిస్థాయిలో వైద్యుల నియామకం జరిగిందని తెలియజేశారు. ఓర్వలేని ప్రతిపక్షాల నాయకులు పని లేని వాడు పిల్లి తల గొరిగినట్లు, స్వార్థం లేకుండా నియోజకవర్గ ప్రజల కోసం , వంద పడకల ఆసుపత్రిని తీసుకొచ్చిన రేగా కాంతారావు పైననే విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, అభివృద్ధిని చూసైనా, విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రతిపక్షాల వాళ్లు పోరాటాలు చేస్తేనే వంద పడకల ఆసుపత్రి వచ్చినట్లుగా, జనాలకు తెలియజేస్తున్నానని, వివేకవంతులైన ప్రజానీకం అంతా గమనిస్తూనే ఉన్నారని తెలియజేశారు. మణుగూరు మండలం లో వంద పడకల ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యుల నియామకం జరుగుటకు కృషిచేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే కాంతారావు కు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు, ఎంపీ కవిత కు, కేటీఆర్ లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానంతరం వంద పడకల ఆసుపత్రి కి నూతన వైద్యులుగా వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మణుగూరు మండల ఎంపిపి కారం విజయ్ కుమారి, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు వట్టం రాంబాబు , పుచ్చకాయల శంకర్,టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: