బ్యాంకు మేనేజర్ సురేంద్ర కుమార్ యాదవ్
మన్యం టీవీ మంగపేట.
మండలం లోని రాజుపేట కెనరబ్యాంక్ లో వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులకు బంగారు ఆభరణాలపై రుణాలను ఇకపై బ్యాంకు పని దినాలలో ప్రతిరోజు మంజూరు చేయనున్నట్టు కెనరా బ్యాంక్ రాజుపేట సీనియర్ మేనేజర్ సురేంద్ర కుమార్ యాదవ్ పత్రికా ప్రకటనలో తెలిపారు గతంలో వారంలో సోమ గురువారాల్లో మాత్రమే బంగారు ఆభరణాలపై రుణాలు మంజూరు చేసేవారని బ్యాంకు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఇకనుండి అతి తక్కువ వడ్డీకే బంగారు ఆభరణాలపై రుణాలను ఫణి దినాల్లో ప్రతిరోజు మంజూరు చేయనున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని కెనరా బ్యాంక్ రాజుపేట శాఖ పరిధిలోని అకినేపల్లి మల్లారం నుండి పాలఇగూడెం వరకు అన్ని గ్రామాల ప్రజలు రైతులు మహిళలు వర్తకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా బ్యాంకు రుణాలు పొందిన ఖాతాదారులు సకాలంలో రుణాలు చెల్లించి బ్యాంకు మరియు ప్రభుత్వం ఇచ్చే వివిధ రకాల రాయితీలను వినియోగించుకోవాలని కోరారు.
Post A Comment: