CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంగపేట లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

స్వతంత్ర పోరాట యోధుడు, తెలంగాణ విముక్తి కోసం నిజాం నవాబ్ ను సైతం ఎదిరించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మదినం సందర్బంగా మంగపేట తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమించాడు. నిజాం పరిపాలనా నిరంకుశత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకించి తెలంగాణ విముక్తి కోసం పోరాడినాడు. ఆ రోజుల్లో తెలంగాణా ప్రజలకు విద్య లేదు, విద్యాలయాలు లేవు ఉన్న కొన్నింటిలో కూడా నిజాం లకు సంబందించిన భాష ఉర్దూ ఉండేది అందులో కొంతమంది కి మాత్రమే ప్రవేశం ఉండేది అటువంటి తరుణంలో విద్య యొక్క ఆవశ్యకత గుర్తించి విద్యాలయాలు కట్టించాలని విద్య పూర్తిగా తెలుగులోనే ఉండాలని పట్టుబట్టాడు. బలవంతంగా తెలుగు ప్రజలపై రుద్దబడుతున్న పార్సి (డెక్కని ఉర్దూ ) మాకు వద్దు అంటూ తెలుగు భాషా వికాసం కోసం ఎనలేని సేవ చేసాడు.అంతేకాదు ఒక పక్క స్వాతంత్ర్య పోరాటం మరో పక్క తెలంగాణ విముక్తి కోసం మరొక వైపు తెలుగు భాషా వికాసం కోసం విరామం ఎరుగని పోరాటం సల్పిన మహానుభావులు అటువంటి మహానుభావులు మనకు చిరస్మరణీయులు వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం, వారిని మార్గ దర్శకులు గా ఎంచుకొని మనం కూడా ప్రజాహితం కోసం పాటు పడాలని ఈసందర్బంగా తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

Post A Comment: