CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భారీ వర్షాల నేపథ్యంలో, అధికారులు ప్రజలు, అప్రమత్తంగా ఉండాలి

Share it:

 


*ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీష్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు నియోజకవర్గం లో ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంత మండలాలైన ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట,వాజేడు వెంకటాపురం (నూగురు) మండలాల్లోని ప్రజలు,మరీ ముఖ్యంగా మత్స్యకారులు ఎవరూ చేపలవేటకు వెళ్లవద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పాడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను,ప్రజలను, కోరారు... భారీ వర్షాలు జిల్లా వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంతాలలోని అన్ని మండలాల లోని ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండి కల్వర్టులు, రోడ్ల పరిస్థితి ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలని, చెరువులు,జలాశయాలు,నీటి మట్టాల ను పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను

48 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు... అదే విధంగా మత్స్యకారులు ఎవరు గోదావరిలోకి చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.

Share it:

Post A Comment: