మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముత్తినేని సుజాత అధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు,తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ ఆయన చిత్రపటానికి పూలామాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షులు కమటం నరేష్,మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి,ఎంపీవో శ్రీనివాసరావు, యూ డి సి పద్మావతి,మాజీ ఎంపీపీ ఊసా అనిల్ కుమార్,తెరాస మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: