గుండాల సెప్టెంబర్ 28 (మన్యం మనుగడ) జోరువానలో సైతం నిత్యం కొలువుకు హాజరవుతూ తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ఉపాధ్యాయులు. శంభుని గూడెం పాఠశాలలో పనిచేస్తున్న బి శ్రీకాంత్, రామకృష్ణ , చెట్టుపల్లి పాఠశాలలో పనిచేస్తున్న బాలాజీ , గోర కళ్ళ మడుగు పాఠశాలలో పనిచేస్తున్న కె రాజు, జే రమేష్ , వెన్నెల బైలు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సిహెచ్ వెంకటేష్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సోమవారం విధులకు హాజరయ్యారు. అన్ని సౌకర్యాలు ఉన్నా కొందరు ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కాని రోజుల్లో రహదారి సౌకర్యం లేకుంనా నిత్యం పాఠశాలలకు హాజరవుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు
Post A Comment: