మన్యం టివి దుమ్ముగూడెం సెప్టెంబర్ 28:కొత్త దుమ్ముగూడెం గ్రామం లో గత శనివారం సమాధి ని త్రవ్వి క్షుద్ర పూజలు నిర్వహించారాని భయాo దోళనలకు గురవుతున్న గ్రామస్తులకు మంగళవారం నృసింహ సేవా వాహిని వ్యవస్థాపకులు కృష్ణ చైతన్య మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించారు.అసలు ఎవరు భయపడ వద్దని మంత్రాలూ తంత్రాలు ఏమి లేవని ఇటువంటివి నమ్మి ఎవరు భయాoదోళనలకు గురి కావద్దని అన్నారు. అలానే గ్రామని విడిచి ఎవరు ఎటు వెళ్లొద్దని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం లో సంస్థ వ్యవస్థాపకులు కృష్ణ చైతన్య, దుమ్ము గూడెం మండల బాద్యులు కృష్ణ, చిన్నబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: