జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ.
తరగతి గది నుండి దేశ భవిష్యత్తు ని నిర్ణయించే పౌరులను తయారు చేసే గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని ఉపాధ్యాయ దినోత్సవం రోజున గురువులకు చేయూత నివ్వడం చాలా సంతోషం కలిగిందని తెలిపారు జేడీ ఫౌండేషన్ భాద్యుడు మురళీ మోహన్ కుమార్ తెలిపారు.ఈ మేరకు దుమ్ముగూడెం మండలం లక్ష్మీ నగరంలోని మడోనా ప్రాథమిక పాఠశాల నందు ఉన్న ఉపాధ్యాయులకు సుమారు 25 మందికి నిత్యావసర వస్తువుల్ని ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ చక్రధర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఏర్పడిన లక్డౌన్ వల్ల స్కూలు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం ఇబ్బందిగా ఉందని ఈ సందర్భంలో పౌండేషన్ వారిని ఉపాధ్యాయులకు నిత్యవసర వస్తువులు అందజేయాలని కోరగా వెంటనే స్పందించి ఈరోజు గురుపూజోత్సవం రోజున అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఫౌండేషన్ సభ్యురాలు శ్రీమతి హన్సి ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు శ్రీ పవన్ కుమార్, కడాలి నాగరాజు, రాంప్రసాద్ రెడ్డి లు ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీమతి హన్సి మాట్లాడుతూ శ్రీ డా. రాజశేఖర్, శ్రీమతి స్పందన శ్రీ ఆకునూరి రమణారావు, శ్రీ నాగ మోహన్, శ్రీమతి స్రవంతి మరియు ఇతర జేడీ సభ్యుల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు .తమ పరిస్థితిని అర్థం చేసుకుని తమకు సహకారం అందించిన జేడీ ఫౌండేషన్ ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని టీచర్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీమతి రూపారాణి మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post A Comment: