మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి జిల్లా నాయకులు ఎండి ఖలీల్ మండల పార్టీ అధ్యక్షులు చిట మట రఘు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అని అన్నారు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే మనకు సమాజంలో ఏ విధంగా వినయ విధేయతతో సమాజంలో దృక్పథంతో ఎలా బ్రతకాలో నేర్పించేది గురువులు,గురువులు లేనిదే జ్ఞానం లేదని జ్ఞానాన్ని పొందాలి అంటే తప్పనిసరిగా గురువు వద్ద విద్య నేర్చుకోవాల్సిందే అని విద్యా వివేక జ్ఞానము అభివృద్ధి వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్, మండల యూత్ అధ్యక్షుడు వసంత శ్రీనివాస్,ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు కర్నె సత్యనారాయణ,యూత్ మండల నాయకులు తోట ప్రశాంత్, చల్ పాక గ్రామ కమిటీ అధ్యక్షులు పడిదల సారయ్య,లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: