సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ
మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి
మోర రవి
కరకగూడెం మండలం బట్టుపల్లి పంచాయతీ గంగెడ్ల కాలనీలో వీధిరోడ్డు చెరువుఅలుగు కాలువపై మోరీలునిర్మించాలని పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోర రవి కోరారు శనివారం న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గంగెడ్ల కాలనీలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించడం జరిగింది గంగిరెద్దులను ఆడించి పొట్ట పోసుకునే సంచార జాతికి చెందిన పదకొండు గంగెడ్ల కుటుంబాలు బట్టుపల్లి గ్రామంలో 40 సంవత్సరాల క్రితం ఇక్కడి చెరువు కట్ట కింద భూమిని కొని నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు ఆనాటి నుండి నేటి వరకు ఎన్నోసార్లు ఎన్నికలు జరిగాయి గ్రామపంచాయతీ పాలకవర్గాలు మారుతున్నాయి కానీ వీరికి ఇంతవరకు వీధి రోడ్డు నిర్మాణం చేయలేదు కనీసం మిషన్ భగీరథ నీటి పైప్ లైన్లు కూడా వీరి సొంత ఖర్చులతో వేసుకున్నారు పారిశుధ్య నిర్వహణ అసలే లేదు వీరు ఇప్పటివరకు డేరాఇండ్లు గడ్డినివాసాల్లో జీవిస్తున్నారు నడవడానికి కష్టంగా ఉన్న వీరికి చెరువు కట్ట కిందనుండి రోడ్డు నిర్మాణం అలుగు కాలువ పై మోరీలు వేయాలని పాలకవర్గాన్ని మండల డెవలప్మెంట్ అధికారులను డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఎన్నికలప్పుడు వీరిని ఓటు వేయడానికి ఉపయోగించుకుని తర్వాత వీరి సమస్యలను గాలికి వదిలేస్తున్నారనీ సామాజికంగా వెనుకబడిన వారిని నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు అంతరించిపోతున్న సంచార జాతులలో గంగిరెద్దులను ఆడించే వారు కూడా ఉన్నారు అంతరించిపోతున్న కళలు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన సభ్య సమాజం పైన ఉందని అన్నారు గ్రామ పంచాయతీ వారు మండల డెవలప్మెంట్ అధికారులు ప్రభుత్వం వీరి పట్ల శ్రద్ధ వహించి గ౦గెడ్ల కాలనీకి వీధి రోడ్డు నిర్మించి చెరువు అలుగు కాలువ పై మోరీలు వేసి వీరందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో నడ్డి రమేష్ ఆవుదొడ్డి మారయ్య ఆవుదొడ్డి ఎల్లయ్య మేకల వెంకన్న ఆవుదొడ్డి వీరయ్య ఆవుదొడ్డి నరసింహ ఆవుదొడ్డి గోపయ్య నడ్డి స్వరూప ఆవులదొడ్డి స్వప్న మంగమ్మ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: