తనను ప్రేమించమంటూ 10వ తరగతి విద్యార్థినీని ఓ యువకుడు వేధించాడు. దాంతో ఆ వేధంపులు తాళలేక ఆ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం........
ఖమ్మం జిల్లాలోని వెంకటగిరిలో సాయి అనే యువకుడు తన ఇంటి ముందు ఉండే 10వ తరగతి విద్యార్థినిని తరచూ ప్రేమ పేరుతో వేధిస్తుండేవాడు.
విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో వారు ఆ యువకుడిని మందలించారు.
అయినా అతనిలో మార్పు రాలేదు. ఈ నెల 9వ తేదీన పాఠశాలకు వెళ్లి వస్తున్న విద్యార్థినీని యువకుడు ప్రేమించాలంటూ వేధించాడు.
దాంతో ఆ వేధింపులు తాళలేక విద్యార్థిని ఇంట్లోకి వెళ్లి పురుగులమందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు బాలికను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందింది. యువకుడిపై ఖమ్మం గ్రామీణ పీఎస్లో విద్యార్థిని బంధువులు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: