మన్యం టీవి, బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మేజర్ గ్రామ పంచాయతీ అయిన సారపాక పరిధిలోని itc pspd నందు ప్రగతి కన్స్ట్రక్షన్ కాంట్రాక్టు లో హెల్పర్ గా పనిచేస్తున్న బందెల లక్ష్మీనర్సు తండ్రి సంజీవరావు అనే చింత్రియాల కాలనీ అశ్వాపురం మండలం కు చెందిన కాంట్రాక్టు కార్మికుడు ఐటీసీ లోపల ఈ రోజు అనగా 10-09-2021 సుమారు ఉదయం 8-10 నుంచి 9-00 గంటల మధ్య సమయం లో అనుమానాస్పద మృతి చెందినట్లు సమాచారం. సదరు కాంట్రాక్టర్ మృతదేహాన్ని చాకచక్యంగా వ్యవహరించి గుట్టుచప్పుడు కాకుండా ఐటీసీ నుంచి బయటకు పంపి హాస్పటల్లో చనిపోయినట్లు చిత్రీకరించినట్టు పలు అనుమానాలు. చిన్నచిన్న కాంట్రాక్టు కార్మికుల పొట్ట కొట్టే విదంగా ఇలాంటి కాంట్రాక్టర్లు ఐ టి సి కి సపోర్ట్ చేస్తున్నారని స్థానికుల ఆరోపణ. ఐటీసీ పెద్దలు సదరు కాంట్రాక్టర్ కొంతమంది ప్రజాప్రతినిధులు కలిసి విషయాన్ని బయటకు తెలియకుండా డబ్బుతో సెటిల్మెంట్ చేసినట్లు సమాచారం... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: