భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 1 (మన్యం టీవీ) బుధవారం నాడు విద్యా శాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలతో పాఠశాల ప్రారంభిస్తున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం లోని బాబు క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జి హెచ్ ఎస్) హెచ్ ఎం బి.మధు వాణీ తెలిపారు.
తమ పాఠశాలలో మొత్తం 184 మంది విద్యార్థులకు గాను 30 మంది మాత్రమె హాజరయ్యారని తెలిపారు. పాఠశాల లో అన్ని గదులు శానిటేషన్ చేశారని
విద్యార్థులు విధిగా మస్క్లులు ధరించి భౌతిక దూరం పాటించటం మంచి నీరు సానిటైజ్ బాటిల్స్ తీసుకొని వచ్చారని అన్నారు.
90 శాతం విద్యార్థులు హాస్టల్ లో ఉంటూ చదువుకునే వారు తమ పాఠశాలలో ఉన్నారని హాస్టల్స్ తెరవక పోవడం వలన విద్యార్థుల హాజరు సంఖ్య తగ్గిందని తెలిపారు.పాఠశాలలు తెరవడం పట్ల తల్లిదండ్రులు,విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషాన్ని వ్యక్త పరిచారు..
Post A Comment: