CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన బాలికపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి

Share it:

 


బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 12 (మన్యం టీవీ) హైదరాబాద్ లో అభంశుభం తెలియని ఆరేళ్ళ గిరిజన బాలికపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి అంబేడ్కర్ సెంటర్ లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట  కండ్లకు గంతలు కట్టుకొని, చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో బహుజనులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని వారికి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.ఎస్పీ,ఎస్టీ కేసుల్లో బాధితులకు ఇవాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, ఎస్సీ,ఎస్టీ కేసులను అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని,అధికారులు దీన్ని వ్యాపారంగా మల్చుకుంటు బాధితులకు న్యాయం చేయడం లేదన్నారు. జిల్లాలో ఎంతమంది దళితులకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.దళితులకు ఇవ్వడానికి లేని భూమి బడావ్యాపారులకు అమ్మడానికి మాత్రం వచ్చిందా అన్నారు,జిల్లా కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ కు సొంత భవనం కూడా లేక అద్దెకొంపలో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి,అసెంబ్లీ కన్వీనర్ బొంతు,కిరణ్, గుడివాడ రాజేందర్, వంగా రవిశంకర్, చుంచుపల్లి మండల యూత్ అధ్యక్షులు కళ్యాణ్,అరుణ్ కుమార్ ఉటుకూరి.విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: