టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
పార్టీ నియోజకవర్గ పరిశీలకుల బృందం
పినపాక మండలంలో భారీగా హజరైన టీఆర్ఎస్ శ్రేణులు
మన్యం మనుగడ, పినపాక :
గ్రామ స్దాయిలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ పరిశీలకులు తుళ్ళూరి బ్రహ్మయ్య, పోశం నర్సింహారావు, పొనుగోటి భధ్రయ్యలు అన్నారు. ఆదివారం ఏడూళ్లబయ్యారం క్రాస్రోడ్లో పినపాక మండల టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాల్లో గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రధాన భూమిక పోషించాలన్నారు. గ్రామ స్దాయిలో టీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను అర్హులకు అందేలా కష్టపడి పనిచేయాలన్నారు. టీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలను ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు సమాచారం అందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయాలన్నారు. కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి పార్టీ వారికి న్యాయం చేస్తుందన్నారు. అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షులను ప్రకటించడం జరిగింది.
ఈ సమావేశంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, సొసైటీ చైర్మన్ రవివర్మ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు బొలిశెట్టి నర్సింహారావు, వట్టం రాంబాబు, ప్రభుదాస్, కోలేటి భవానీ శంకర్, టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ఉడుముల లక్ష్మిరెడ్డి,లతో పాటు మండల ముఖ్య నాయకులు దాట్ల వాసుబాబు, పోలిశెట్టి సత్తిబాబు, ముక్కు వెంకటేశ్వరరెడ్డి, పటేల్ కామేష్ ,కటకం గణేష్, దినసరపు శ్రీనివాస రెడ్డి, ఎగ్గడి శ్రీరామ్ మూర్తి, సోంపల్లి తిరుపతి, గొంది నాగభూషణం, షేక్ పెదమీరాసాహెబ్, యాంపాటి సందీప్ రెడ్డి ,వాసం స్వాతి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాల భాధ్యులు పాల్గొన్నారు.
Post A Comment: