.
భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 7 (మన్యం టీవీ) మంగళవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం,లక్ష్మీదేవి పల్లి మండలం లోని రేగళ్ళ పంచాయతీ మరియు చుట్టు ప్రక్కల ఉన్న 6 పంచాయతీలలో నిన్న పడిన భారీ వర్షానికి వరదనీరు వచ్చి గిరిజన పేద రైతుల పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగ సీతారాములు మాట్లాడుతూ ప్రధాన పంటలు అయినా పత్తి,మిర్చిపంటలకు తీవ్రంగా నష్టం జరిగిందని. రైతులు గత మూడు నెలల నుంచి కష్టపడి చేతికొచ్చిన పత్తి పంట వరదలకు దెబ్బతినటం చాలా బాధ కలిగించింది అన్నారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోవ్యవసాయంపై ఆధారపడిన గిరిజన, ఆదివాసి రైతులు ఎక్కువగా ఉన్నారు.కావున జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని వెంటనే అధికారులను పంపించి గిరిజన, ఆది వాసి రైతులను ఆదుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఏలూరు కోటేశ్వరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు చింతలపూడి రాజశేఖర్ ,గుగులోత్ .రుప్లా, ధారావత్. రమేష్, అజ్మీర.సురేష్, జాటోత్ .రాజా, జాటోత్. శంకర్ భూక్యా.సీతారాం, భూక్యా. బిచ్య, గుగలోత్. భాను, జర్పులా. మున్యా, జాటోత్. గంగి, భాధిత ైతులు పాల్గొన్నారు.
Post A Comment: