CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి"

Share it:

 


👉న్యూడెమోక్రసీ పార్టీ ముద్ద బిక్షం డిమాండ్.

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ మరియు పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని,ములకలపల్లి మండలం కంపగూడెం లో సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ మండల కమిటి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్ఠి బొమ్మను దగ్దం చేసారు.ఈ కార్యక్రమంలో పార్టి జిల్లా నాయకులు కామ్రేడ్ ముద్దా బిక్షం పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీ.జే.పీ పార్టీ  అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి సామాన్యుల నడ్డివిచిచే విధంగా, విపరీతంగా నిత్యవసర సరుకులు.వంట గ్యాస్.మరియు పెట్రోల్ డిజీల్ ధరలు పెంచడం రోజువారి కార్యక్రమంగా పెట్టుకుందని అన్నారు. ఈ మధ్య రెండు రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ ధర 14 రూపాయలు పెంచిందని వీటిని వెంటనే ఉప సంహారించుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో పార్టి డివిజన్ కార్యదర్శి అమర్లపూడి రాము,జిల్లా నాయకులు నూపా భాస్కర్,మండల కార్యదర్శి కల్లూరి కిషోర్.పోతుగంటి లక్ష్మణ్,మండల నాయకులు కుంజా కృష్ణ,తాటి తిరుపతయ్య,యర్రగొర్ల రామారావు,ఎం.పీ.టీ.సీ నూపా సరోజని తదితరులు పాల్లొన్నారు.

Share it:

Post A Comment: