🌷టీఆర్ఎస్ పార్టీలో యువతకు బంగారు భవిష్యత్:ప్రభుత్వ విప్ రేగా కాంతారావు🌷
నేటి యువత రేపటి భవిష్యత్తుకు మార్గదర్శకులుగా పని చేయాలని ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.
బుధవారం మణుగూరు హనుమాన్ పంక్షన్ హాల్ నందు టీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజక వర్గ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్ అధ్యక్షతన యువజన విభాగం నాయకులకు సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హజరుయ్యారు.
ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ....టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ,అభివృద్ధి పథకాలను ప్రజలల్లోకి తీసుకవెళ్ళే విధంగా యువత పని చేయాలని ఆయన తెలిపారు.
ఈ సమాజానికి యువత చాలా కీలకపాత్ర వహించాలని,టీఆర్ఎస్ పార్టీ కోసం క్రీయశీలకంగా పని చేసే యువతకు రానున్న రోజుల్లో మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని రేగా తెలిపారు.
నిరంతరం పార్టీ కోసం కృషి చేసే యువత,కార్యకర్తలను కంటిపాపల కాపాడుకుంటామని ఆయన అన్నారు.
కష్టపడేవారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రమ్మయ్య,జెడ్పీటీసీ పోశం నరసింహారావు,వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు,యువజన నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: