CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రేగా కుటుంబంలో విషాద ఛాయలు

Share it:

 



జ్వరంతో మృత్యు ఒడికి చేరిన మేనల్లుడి భార్య


బోరున విలపించిన రేగా కాంతారావు దంపతులు


మన్యం మనుగడ, కరకగూడెం: 


తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్ని రోజుల క్రితమే వివాహం జరిగిన తన మేనల్లుడు అజయ్ భార్య అఖిల జ్వరంతో బాధపడుతూ గురువారం రోజున మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న రేగా కాంతారావు కన్నీటి పర్యంతమయ్యారు. వివాహమైన ముచ్చట మరువకుండానే మేనల్లుడి భార్య మృతిచెందడంతో, కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. అఖిల ఆరోగ్యం సరిగా లేని సమయంలో, రేగా కాంతారావు సతీమణి సుధారాణి ఆసుపత్రిలోనే ఉండి, సపర్యలు చేయడం జరిగింది. అఖిల మా కుటుంబం లో అడుగు పెట్టిన నాటి నుండి సంతోషం వెల్లివిరిసింది అని, ఇప్పుడిలా మమ్మలని అందరిని వదిలేసి,తాను వెళ్లిపోయిందని రేగా దంపతులు బాధపడుతుంటే, ఓదార్చడం ఎవరి తరం కాలేదు. రేగా కాంతారావు దగ్గరుండి అఖిల కు అంత్యక్రియలు చేయడం జరిగింది.

Share it:

Post A Comment: