పాఠశాల పునఃప్రారంభ సందర్భంగా కరోనా నిబంధనలలో భాగంగా మాస్కులు ధరించి విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాల్సి ఉంది. కానీ పాఠశాల విద్యార్థులు అందరూ మాస్కులు కొని ధరించడం కష్టసాధ్యం అని భావించి ఊరిలోని పెద్దలను వితరణ కోరగా తల్లిదండ్రుల్లో ఒకరైన ములకలపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పోతుగంటి క్రాంతి స్పందించి మాస్కులు వితరణ చేయగా విద్యార్థులకు అందజేయడం జరిగింది.అలాగే ఈ సంవత్సరమే మొదటి తరగతిలో జాయిన్ ఐన పిల్లలకు మన పాఠశాల ఉపాధ్యాయిని ధనలక్ష్మి సహృదయంతో పలకలు, బలపాలు అందజేయడం హర్షించదగ్గ విషయమని,మంచి మనసుతో వితరణ చేసి,మన విద్యార్థులకు సాయమందించిన వీరిరువురికి పాఠశాల విద్యాకమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లు గౌరి లక్ష్మీ ,తాండ్ర అరుణ, మరియు గ్రామ పెద్దలు నాగేశ్వరరావు,మరియు గ్రామస్తులు పాల్గొని ఈ వితరణ కార్య క్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
Navigation
Post A Comment: