మన్యం టీవీ చర్ల
చర్ల మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అందరూ కూడా మానవహారం లో పాల్గొని ఆజాది కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 లో పాల్గొని మానవహారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బండి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ బలమైన సమర్థవంతమైన చురుకైన ఆరోగ్యకరమైన శరీరం కోసం ప్రతిరోజు అరగంట వ్యాయామం చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బండి సత్యనారాయణ, లైబ్రేరియన్ గరుడాచలం, సీనియర్ లెక్చరర్ శెట్టి ప్రసాద్, అమృత రావు ,ఎన్ ఎస్ ఎస్ పి ఓ ఏ వెంకటేశ్వరరావు మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: