CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉కలెక్టరేట్ కార్యాలయం ముందు యువతి ఆత్మహత్యాయత్నం

Share it:


👉 స్థలాన్ని ఇతరులు కబ్జా చేస్తున్నారని ఆరోపన

భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 13 (మన్యం టీవీ): తమ స్థలాన్ని ఇతరులు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తు మనస్తాపానికి గురైన యువతి కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా సమస్యను కలెక్టర్ కు విన్నవించేందుకు వచ్చిన యువతి కార్యాలయం ముందు కొద్దిసేపు వేచిచూసింది. అప్పటికి కలెక్టర్ చాంబర్లోకి రాలేదు. తీవ్ర ఆవేశానికి లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఆరోగ్య కార్యకర్త, పోలీసులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.... కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రామవరం 7 నెంబర్ బజార్ ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న బండి సరళకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె హైదరాబాదులో ఉపాధ్యాయ వృత్తిలో పని చేస్తున్నారు. చిన్న కుమార్తె బండి హైమావతి స్థానికంగా బ్యూటిషన్ సొంతగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో వారి ఇంటి స్థలం పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కబ్జాకు పాల్పడుతున్నారని, ఈ విషయంలో తమ కుటుంబం పై దాడులకు పాల్పడ్డారని, మహిళల మైన మాకు ప్రాణ రక్షణ లేకుండా పోయిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆసుపత్రిలో తహసిల్దార్ కు విన్నవించారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులు పరిశీలన చేయాలని కలెక్టర్ సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share it:

Post A Comment: