👉సంజయ్ నగర్ పంచాయతీకి సొంత భవనం కేటాయించాలని విజ్ఞప్తి.
👉వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి
👉సంజయ్ నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య పద్మ.
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 13 (మన్యం టీవీ) :లక్ష్మీదేవిపల్లి మండలం సంజయ్ నగర్ గ్రామ పంచాయతీకి సొంత భవనం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యపై అధికారులు దృష్టిపెట్టి పంచాయతీకి సొంత భవనం కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సంజయ్ నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య పద్మ గ్రీవెన్స్ డే సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసింది. ఆ వినతిపత్రంలో పంచాయితీ నిర్వహణ అద్దె భవనంలో ఉండడంవల్ల పెద్ద మొత్తంలో కిరాయి చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. మత్స్యకార కార్యాలయంలో ఒక గది ఖాళీగా ఉందని ఆ గది పంచాయతీకి కేటాయిస్తే అద్దె భారం తగ్గుతుందని వివరించారు. అదేవిధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ముర్రేడు వాగు పక్కనున్న అనేక మంది ఇల్లు కూలిపోవడం జరిగిందని వారందరికీ డబుల్ బెడ్ రూములు ఇల్లు ఇవ్వాలని సంజయ్ నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ భూక్య పద్మ విజ్ఞప్తి చేసింది. వినతి పత్రం సమర్పించిన వారిలో సర్పంచ్ పద్మ తో పాటు వార్డు సభ్యులు సురేందర్, సుధాకర్, నరసింహారావు, మధు, రాంబాబు తదితరులు ఉన్నారు.
Post A Comment: