మన్యంటీవి, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, రాచూరిపల్లి గ్రామం మిడియం భద్రయ్య కుమారుడికి గుండె జబ్బు ఉన్న కారణం వల్ల ఇంతకు ముందు ఆపరేషన్ అయినప్పటికీ మళ్ళీ అనారోగ్య పాలవడంతో ఎంఎల్ఏ మెచ్చా నాగేశ్వరావుని సంప్రదించగా వైద్య నిమిత్తం అన్ని ఏర్పాట్ల చేస్తామని వారికి భరోసా కలిపించి తక్షణ సహాయంగా 5000/- ఆర్థిక సహాయాన్ని స్థానిక టీఆర్ఎస్ నాయకుల చేతులమీదుగా ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాయుడు శ్రీను, సర్పంచ్ తోట రాజు, తెరాస గ్రామ అధ్యక్షుడు ధనరాజు మరియు కార్యకర్తలు రావూరి వీరయ్య, తోట కన్నరావు, సోయం బాబురావు, గోవింద రాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: