మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏటూరు నాగారం పట్టణ రజక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ 36 వ వర్ధంతి వేడుకలకు స్థానిక సర్పంచ్ ఈ సం రామ్మూర్తి, జిల్లా కోఆప్షన్ సభ్యురాలు వాలియాబీ సలీం హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం పోరాడిన వీర నారీ చాకలి ఐలమ్మ అని వారి ఆశయాలతో ముందుకు సాగాలని కొనియాడారు.రజక సంఘం నాయకులు మాట్లాడుతూ ఏటూరు నాగారం పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహం ప్రతిష్టాపన కొరకు స్థలం కేటాయించే విధంగా ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి భరత్, రజక సంఘం పట్టణ అధ్యక్షులు లాలయ్య,ప్రధాన కార్యదర్శి పర్వతాల ఎల్లయ్య, కోశాధికారి ముక్కెర బిక్షపతి, మండల అధ్యక్షుడు ముక్కెర లాలయ్య,గౌరవ సలహాదారు పర్వతాల లాలయ్య, కుమారస్వామి,వెంకటేశ్వర్లు, బిక్షపతి,అశోక్,సోమయ్య,రవి సురేష్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: