అశ్వాపురం : రోడ్డు ప్రమాదం లో గాయపడి ఈ రోజు ఉదయం మరణించిన సీతారాంపురం గ్రామానికి చెందిన కరెడ్ల శ్రీనివాసరావు (56) కుటుంబ సభ్యులకు మండల టాటా ఏస్ ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 20వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరావు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందించారు ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గంటా క్రాంతి కిరణ్ రెడ్డి యూనియన్ నాయకులు మురళి రాగి సాగర్ తులసి ఆనందరావు గరటి రాంబాబు పవన్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: