వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ సీతారాములు
గుండాల ఆగస్టు 24 (మన్యం మనుగడ) పశువుల దూడలకు వ్యాక్సిన్ వేయించడంతో వ్యాధులు దరిచేరవని గుండాల సర్పంచ్ కోరం సీతారాములు అన్నారు. వేపల గడ్డ గ్రామంలో పశువైద్యుల ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆయన ప్రారంభించారు. అనంతరం వెటర్నరీ అసిస్టెంట్ హరికిరణ్ మాట్లాడుతు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని గ్రామాల్లో ఉన్న పశువుల అన్నిటికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం వచ్చే నెల 16 వరకు ఉందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమాలు వైద్య సిబ్బంది రాము, నరేష్, కృష్ణమూర్తి, పాల్గొన్నారు
Post A Comment: