👉 నేటి నుంచి వారం రోజుల పాటు నిర్వహించనున్న నులిపురుగుల నివారణ కార్యక్రమం
👉 నేషనల్ డి వార్మింగ్ డే సందర్భంగా కార్యక్రమం చేపట్టినట్లు ప్రియాంక వెల్లడి
మన్యం మీడియా ప్రతినిధి/ అన్నపురెడ్డిపల్లి:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల గ్రామాల్లోని ప్రతి ఇంటిని స్థానిక అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలతో సందర్శించి, 19 సంవత్సరాల లోపు వయస్సు పిల్లలకు, నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు మరియు పిల్లల్లో వచ్చే రక్తహీనత, పౌష్టికాహారం అందించకపోవడం వలన పిల్లల్లో వచ్చే లోపాలు, పాటించవలసిన వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత అంశాల గురించి పిల్లలకు, కుటుంబ సభ్యులకు అవగాహన చేయనున్నట్లు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ప్రియాంక వెల్లడించారు.
Post A Comment: