పాఠశాలల పునప్రారంభానికి సర్వం సిద్ధం
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆదేశానుసారం మణుగూరు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు,అంగన్ వాడి కేంద్రాల ను పరిశీలించి, సెప్టెంబర్ 1వ తారీకు నుండి పాఠశాల లు తెరుచుకోనున్న నేపద్యంలో పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా,పిల్లలందరూ ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లను చేయాలని, సంబంధిత గ్రామ పంచాయతీ సర్పంచ్ లను, కార్యదర్శులను జడ్పీటీసి పొశం.నరసింహారావు, ఎంపీపీ కారం.విజయ కుమారి ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ చంద్రశేఖర్,ఎంపీడీవో వీరబాబు,ఎంపీఓ పల్నాటి. వెంకటేశ్వర్లు,సిడిపిఓ విజయలక్ష్మి,నోడల్ అధికారి సుమలత,స్థానిక సర్పంచు లు,కార్యదర్శులు,ఎంపీటీసీలు ఈ కార్యక్రమం లో పాల్గొని గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి పాఠశాల ప్రాంతాన్ని,తరగతి గదులను,పరిశీలించి పరిసరాలను శుభ్రం చేయించారు.
Post A Comment: