భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 17 (మన్యం మీడియా) :
కొత్తగూడెం ఏరియా జిఎం కార్యాలయము నందు మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలో పని చేస్తూ మార్చి 2021 నుండి జూలై 2021 వరకు పదవీ విరమణ 60 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచుతూ వెలువడిన కంపనీ ఉత్తర్వుల ప్రకారం పదవీ విరమణ పొందిన 60 మంది ఉద్యోగులకు తిరిగి మరలా ఉద్యోగం చేయటానికి పునః నియామక ఉద్యోగ పత్రాలను కొత్తగూడెం ఏరియా జిఎం నరసింహా రావు అంధించారు. ఈ సందర్భంగా జిఎం సిహెచ్ నరసింహ రావు
మాట్లాడుతూ సంస్ధ సి&ఎండి ఆదేశాల మేరకు '60' మందికి పునః నియామక ఉద్యోగ పత్రాలను అందజేశామని , పునర్ ఉద్యోగాల నియామక పత్రాలు అందుకున్న వారికి జి.ఎం శుభాకాంక్షలు తెలిపారు. తిరిగి నియామక పత్రాలను పొందిన వారందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని శ్రద్ధగా క్రమశిక్షణ తో పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టిబిజికేఎస్ వైస్ ప్రెసిడెంట్ రజాక్, ఇంచార్జ్ ఎస్ఓటు జిఎం శ్రీరమేష్, పర్సనల్ మేనేజర్ డి.కిరణ్ బాబు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.
Post A Comment: