మన్యంటీవీ, అశ్వారావుపేట: మహిళా ప్రయాణికులతో ఆటో డ్రైవర్లు సత్ప్రవర్తనతో మెలగాలని అశ్వారావుపేట ఎస్సై చల్ల అరుణ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆటో డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్సై చల్ల అరుణ మాట్లాడుతూ ఆటోలు నడుపుతున్నప్పుడు అన్ని పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులు తీసుకెళ్లద్దని, విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు ఆటోలో ఎక్కినప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
Post A Comment: