CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ

Share it:

 


*సమరిటన్స్ ఫర్ ది నేషన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో 40మంది జర్నలిస్టు మిత్రులకు నిత్యావసర సరుకులు అందజేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.

*మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం హైదరాబాద్ కు చెందిన సమరిటన్స్ ఆఫ్ ది నేషన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో 40మంది జర్నలిస్టు మిత్రులకు నిత్యావసర సరుకులు అందజేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం మండల అధ్యక్షులు చిటమట రఘు,ఏటూరు నాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరసవడ్ల వెంకన్న, స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి,కన్నాయిగూడెం మండల అధ్యక్షులు ఎండి అఫ్సర్ పాషా,కన్నాయిగూడెం జడ్ పి టి సి నామ కరం చందు గాంధీ,కన్నాయిగూడెం మండలం వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్,ఏటూరునాగారం పి ఎసిఎస్ వైస్ చైర్మన్ బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముక్కెర లాలయ్య, పైడిపల్లి ఎల్లేష్, జిల్లా మైనార్టీ కార్యదర్శి ఎండి సులేమాన్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు వావిలాల సాంబశివరావు, జిల్లా నాయకులు మహమ్మద్ ఖలీల్,ఎంపీటీసీ గుడ్ల శ్రీలత దేవేందర్,ఏటూరు నాగారం గ్రామ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి నరేందర్,ఏటూరు నాగారం గ్రామ కమిటీ యూత్ అధ్యక్షులు ముస్తఫా,మాజీ ఎంపీటీసీలు వావిలాల నరసింహారావు,పెద్ద బోయిన నరసింహారావు,వార్డ్ మెంబర్ పడిదల హనుమంతు,బుర చేరాలు,ఫరూఖ్,మహమ్మద్ అలీ,అహ్మద్ అజ్మత్,మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: