*గుత్తి కోయలకు కష్టాలు తప్పవా.
*హర్షం వ్యక్తం చేసిన స్థానికులు.
*ఆనందంలో గిరిజన కుటుంబం.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా, కన్నాయిగూడెం మండలకేంద్రంలోని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన సునార్కని సమ్మక్కకి పురుటినొప్పులు రావడంతో దగ్గరలోని 108 కి సమాచారం అందించి విషయాన్ని తెలియచేశారు.ఆదివరకె మరో కేసులో ఉన్న సిబ్బంది వారికి విషయం తెలియగానే వారితో ఉన్నా పేషేంటుని ఆసుపత్రిలో చేర్చి వెంటనే,హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గర్భిణికి పరిస్థితిని పరీక్షించి పురుటినోప్పులు అధికం అవడం గమనించిన సిబ్బంది వెంటనే సుఖప్రవసం చేసి పండంటి ఆడబిడ్డకు పురుడుపోశారు.తల్లి బిడ్డలు క్షేమంగా ఉండగా మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. అడవిలో గుత్తి కోయలకు తప్పని కష్టాలు ఏటూర్ నాగారం మండల పరిధిలోని గుండెగావాయి కి చెందిన గుత్తి కోయ మహిళ కి పురిటి నొప్పులు రాగా అక్కడి గూడెం వసూలు గర్భిణీని,మంచం మీద మొసుకోని 2 కిలోమీటర్లు రోడ్డు లేక పోవడం తో అడవి మార్గం గుండా మొసు కొని వచ్చిన అడవిలో పురుడు పోసుకుంది.తరువాత వైద్య సేవలు అందించేందుకు ఏటూర్ నాగారం వైద్య శాలకు తరలించారు.ఎంతో ఛాణచక్యంగా వ్యవహరించి పురుడుపోసిన 108 సిబ్బంది ఈఎంటి శివలింగంప్రసాద్, పైలట్ సతీష్ లను పలువురు అభినందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటూన ప్రజలకు కష్టాలు తాపడం లేదు ని పలువురు వాపోతున్నారు.
Post A Comment: