మన్యం టీవీ కరకగూడెం :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు,జిల్లా కలెక్టరు అనుదీప్ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్న సందర్భంగా కరకగూడెం ఎంపిపి రేగా కాళిక ,జడ్పిటిసి కొమరం కాంతారావు స్పెషల్ అధికారి జైసింగ్ గురువారం కరకగూడెం(చిరుమళ్ళ)గిరిజన ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక పాఠశాలను పరిశీలించి,పాఠశాల పనులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా నమోదు చేయాలని పాఠశాల ఉపాధ్యాయులు ఆమె సూచించారు.అదే విధంగా పాఠశాల ప్రాంగణంలో కోవిడ్ నిభంధన పట్టించాలని ఆమె అన్నారు.పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సర్పంచుకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ధారవత్ శ్రీను,స్థానిక సర్పంచు పాయం నర్సింహారావు,ఎంపీటీసీ యలిపెద్ది శైలజ,పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ధారవత్ జగన్ నాయక్,పంచాయితీ సేక్రటరీ పూర్ణ ప్రణీంద్ర,హెల్త్ ఆసిస్టెంట్ గోగ్గల నరసింహారావు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: