- నిండు గర్భిణి ని పట్టించుకోని వైద్య సిబ్బంది ఇద్దరి ప్రాణలకు దారి తీసింది.
- నా భార్య బిడ్డను పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం వల్లనే ఈ దారుణం జరిగింది భాదితులు తల్లడిల్లిపోతున్నారు.
మన్యం టీవీ పాల్వంచ :-
వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పుల్లాయిగూడెం నివాసి పూనెం.కమల భర్త పూనెం.కుమార్ భార్యను ది.02/08/2021 పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్ (కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం) లో చేర్పించిన నాలుగు(4) రోజులు గడిచిన ఎవరు పట్టించుకొకపోవడం తన భార్య ,పిల్ల, చావుకు కారణం అయ్యారు తర్వాత సీరియస్ పరిస్తితి లో కొత్తగూడెం తీసుకెళ్ళండి అని హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు, చేతులెత్తేశారు.వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు అయినా ప్రయోజనం లేకుండా పోయింది. బిడ్డ ప్రాణాలు పోయాయి
తర్వాత తల్లి అయిన బ్రతికించడి బాబు అని మొరపెట్టుకుంటే వరంగల్ ఎం. జి.ఎం హాస్పిటల్ కు అంబులెన్స్ లో తరలిస్తుంటే మార్గమధ్యలో ఎక్కువ రక్త స్రావం జరిగి తల్లి కూడా మరణించింది.
Post A Comment: