తండ్రి కలను నెరవేర్చిన తనయుడికి సన్మానం
మహేష్ ను సన్మానించిన గుండాల ఎంపీటీసీ సంధాని మరియు సర్పంచులు
గుండాల ఆగస్టు 8 (మన్యం మనుగడ) తల్లిదండ్రుల కలను నెరవేర్చిన తనయుడికి ఘన సన్మానం. మండలం పరిధిలోని నర్సాపురం తండాకు చెందిన భానోత్ శీను విజయల కుమారుడైన బానోత్ మహేష్ లా ఎంట్రన్స్ టెస్ట్ లో తెలంగాణ రాష్ట్రంలోనె మొదటి స్థానం సాధించి ఆలిండియా కేటగిరిలో ఇరవై రెండో స్థానం లో నిలిచిన బానోత్ మహేష్ ను ఆదివారం గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని, రోళ్ల గడ్డ సర్పంచ్ అజ్మీరా మోహన్, మామ కన్ను సర్పంచ్ ముత్యమా చారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శోభన్ బాబు, ఆదివారం ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతు. చిన్ననాటి నుండి ఎంతో కష్టపడి చదివించిన తల్లిదండ్రుల కలను మహేష్ సాధించడం అభినందనీయమన్నారు. ముందు ముందు అనేక విజయాలను సాధించాలని వారు కోరారు. మొదటి నుండి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న మహేష్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు
Post A Comment: