మనం టివి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
దమ్మపేట మండలం గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ సమావేశం శ్రీరామ్ పురం గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూపంచాయతీ కార్మికులకు రూ.21 వేలవేతనం ఇవ్వాలని నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ప్రతి కార్మికుడికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని సిపిఆర్ లిస్టులో పేరు నమోదు చేయాలని ప్రభుత్వం ప్రకటించిన 30%వేతనాన్నివెంటనే అమలుచేయాలని రేపు పదో తారీఖున ఎంపీడీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించాలని 12 తారీఖున అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీల వినతి పత్రం ఇవ్వాలని సమావేశాంలో నిర్ణయించడం జరిగిందిఈ కార్యక్రమంలో మండల పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు చెన్నారావు ప్రభాకర్, వెంకటేశ్వర రావు,నాగేశ్వర రావు,ధర్మయ్య,మోహన రావు, రాములు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: