👉 కోయ బిడ్డని అని అగౌరవ పరుస్తున్నారు.
👉 పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ దుస్థితిపై టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తా.
పినపాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు- కొర్సా ఆనంద్
మన్యం మనుగడ, పినపాక:
దళిత, గిరిజన సత్యాగ్రహ దీక్షకు, అతిథిగా ఆహ్వానించడం ఏమిటని పినపాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఆనంద్ కాంగ్రెస్ నియోజకవర్గ పెద్దలపై అసహనం వ్యక్తం చేశాడు. వర్గ భేదం తీసుకురావాలని, కొందరు కావాలని ఇలా చేస్తున్నారని ఆరోపించారు. యువతకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కడం లేదని, కష్టపడే యువతను పక్కకు నెట్టి వేస్తున్నారని తెలియజేశారు. సఖ్యత లేని అలాంటి వారి మధ్య ఉండడం సిగ్గుచేటని అన్నారు. సొంత పార్టీలోనే సఖ్యత లోపిస్తే ఎదుటి పార్టీల వారికి చులకన అవుతున్నామని, ఈ విషయాన్ని అనుభవం కలిగిన నాయకులు గ్రహించలేక గుడ్డి వాదనలు చేస్తున్నారని అన్నారు. అనుభవం కలిగిన నాయకులు, పార్టీ అభివృద్ధికి అడుగులు వేసే దిశగా పయనించాలని, అలాంటి లక్షణాలు ఎవరిలో లేవని తన మనోగతాన్ని "మన్యం మనుగడ"తో పంచుకున్నారు.
Post A Comment: