మన్యంటీవీ, అశ్వారావుపేట: కొన్ని సంవత్సరాలుగా శిధిలావస్థలో ఉన్న పంచాయతీ కార్యాలయాన్ని సర్పంచ్ కంగాల పరిమేష్ ఆధ్వర్యంలో తొలగించడం జరిగింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీ పరిపాలన స్థానికి రైతు వేదిక కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు, నూతన పంచాయతీ కార్యాలయం ప్రభుత్వం మంజూరు చేయాలని స్థానిక ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల పుల్లారావు, జక్కుల రాంబాబు, పసుపులేటి సుబ్బారావు, ఉప సర్పంచ్ చిన్నంశెట్టి శ్రీనివాసరావు, కాండ్రు కొండ శ్రీనివాసరావు, వార్డ్ మెంబర్స్ నిర్మల మల్లికార్జున రావు, సవరం వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: