👉 టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
మన్యం టీవీ కొత్తగూడెం, ఆగస్టు 9:-
సుజాత నగర్ మండలం నరసింహ సాగర్ గ్రామంలో వాంకుడోత్.పూల్ సింగ్,వాంకుడోత్. మూన్యా, డి ఆర్ మంగీలాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగా.సీతారాములు సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. టీఆరెఎస్ పార్టీ హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు దళితబందు పేరుతో మోసం చేస్తునారా న్నారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని ప్రకటించి మాట తప్పరన్నారు. ఉద్యోగాలు రాక యువత బలవన్మారానాలకు పాల్పడుతున్నారని అన్నారు. లక్ష లోపు రుణాలు మాపి చేస్తానని ప్రకటించి కేవలం 50వేల రూపాయలు రుణాలు మాత్రమే మాఫి చేసి రైతులను మోసం చేసారన్నారు. టీఆరెఎస్ నాయకుల ఆగడాలకు విసిగి వేసారిన గిరిజనులు రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క సారథ్యంలో పని చేసేందుకు ముందుకు వచ్చారన్నారు.ఈకార్యక్రమములో జిల్లా కాంగ్రెస్ నాయకులుచింతలపుడి.రాజశేఖర్, కిసాన్ సెల్ జిల్లా జనరల్ సెక్రటరీ మడిపల్లి.శ్రీనివాస్ ,గరీబ్ పేట ఎంపీటీసీ,కసనబోయిన.భద్రం,యువజన కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ షేక్ అభీద్, మైనార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ,కరీంపాషా,తెల్లబోయిన.వెంకటేశ్,తేజావత్ శ్రీను,తేజావత్.సాయి, మురిపిడి.గణేష్,నర్సింహసాగర్ గ్రామపెద్దలు,యువకులు,మహిళలు ,బారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: