మన్యం టివి దుమ్ముగూడెం : దుమ్ముగూడెం మండలం లోని కె . వీరభద్రపురం సిపిఎం మహాసభ కామ్రేడ్ పూసం అంజయ్య వారి సతీమణి రాంబాయమ్మ కామ్రేడ్ పాండు అచ్చి రాజు అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ ఈ కష్టకాలంలో లో సిపిఎం పార్టీ సీనియర్ శాఖ కార్యదర్శి అంజయ్య అలానే వారి సతీమణి కరుణతో మరణించడం చాలా బాధాకరం అని వారి కుటుంబానికి కి అలానే సీపీఎం పార్టీకి తీరనిలోటని చెప్పారు ఆ ప్రాంతంలో అనేక పోరాటాలతో ముందుండి పని చేశారని ప్రతి కార్యకర్త నాయకులు స్ఫూర్తితో పని చేయాలని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలానే ఆగిపోయిన కొత్త రేషన్ కార్డులు ఎవరు ఇచ్చి ప్రభుత్వం ప్రజల్ని మభ్య పెడుతుందని ఆగిపోయిన పనులు వెంటనే ప్రభుత్వం పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు .ప్రగలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కి నిధులు మంజూరు చేయాలి అని డిమాండు చేశారు.దీని ద్వెరా సున్నం బట్టి నుండి కొత్తపల్లి వరకు సాగునీరు అందుతుందని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎలమంచి వంశీకృష్ణ ,మర్మం చంద్రయ్య రామచంద్రయ్య ,వెంకన్న బాబు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: