CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

"ఆడి అమావాస్య,ఆదివారం, పుష్యమి నక్షత్రం సందర్భంగా శివాలయంలో విశేషపూజలు"

Share it:


మన్యం టీవీ పాల్వంచ:-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం బొల్లోరిగూడెంలో వెలసిన శ్రీ లలితా కామేశ్వర స్వామి ఆలయంలో ఆడి అమావాస్య,ఆదివారం, పుష్యమి నక్షత్రం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు.మూడు విశేషాల ప్రత్యేతను సంతరించుకున్న రోజును అత్యంత శక్తివంతమైన రోజుగా భక్తులు విశేష పూజలు నిర్వహిస్తారు.శివాలయంలో పూజలు,అభిషేకాలు నిర్వహించిన భక్తులకు వ్యాపారాభివృద్ధి,విద్యా,ఉద్యోగాభివ్రుద్ధి, ముఖ్యంగా పిత్రుదోష నివారణ కలిగుతుందని శాస్త్రం చెబుతోందని ఆలయ పూజారి సాయి చైతన్య శర్మ తెలియచేసారు..అందుకే ఈ రోజు విశేషంగా అధిక సంఖ్యలో భక్తులు శివిలయాన్ని దర్శించు కొని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శివలెంక అశ్విని కుమార్,కమిటి సభ్యులు రెడ్డిరాజుల వెంకట్,ముడిక శ్రీనివాసరావు,భాగ్యమ్మ,పిట్టా వెంకటరెడ్డి,చెరకు అశోక్,గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డి,అప్పికట్ల చిరంజీవి,వెంగళదాసు జానకి ప్రసాద్,శనగ రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: