మన్యం టీవీ కరకగూడెం:బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను కరకగూడెం మండల ఎంపిపి రేగా కాళిక చేతుల మీద ప్రారంభించడం జరిగింది.
కరకగూడెం మండలంలోని సమత్ భట్టుపల్లి గ్రామపంచాయతి పరిధిలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి,ప్రకృతి వనంలో మొక్కలు నాటారు.అనంతరం ఆమె మాట్లాడుతూ
పనులు త్వరగా పూర్తి చేసి మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.వనం చుట్టూ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆమె అన్నారు.
ఆమె వెంట ఎంపీడీవో జవహర్లాల్, తదితరులు ఉన్నారు.
ఈ కార్యాక్రమంలో స్థానిక సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి,ఎంపీడీఓ ధారవత్ శ్రీను,ఎంపీఓ కృష్ణకుమారి,సర్పంచులు పాయం నర్సింహారావు,కుంజ వసంతరావు,బత్తిని నర్సింహారావు,కొమరం విశ్వనాధం,పోలెబోయిన నరసింహరావు,సేక్రటరీ లక్ష్మయ్య,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: