మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని రైతులు వానలు మొదట మురిపించి, ఇప్పుడు లేక నానా అవస్థలు పడుతున్నారు. పినపాక మండలం లోని పినపాక గ్రామానికి చెందిన ఓ రైతు చేసేది ఏమీ లేక రోడ్డుకు అవతలి వైపు ఉన్న నీటి కుంట నుండి సరికొత్త ఆలోచనతో, రోడ్డుకు అటు వైపు ఉన్న నీటిని ఇటు వైపు గల తన పొలంలో కి మళ్లించేందుకు, ఇంజను సాయంతో వాహనదారులకు ఇబ్బంది లేకుండా రోడ్డుకు సగభాగంలో పైపును వదిలివేయగా నీరు అవతలి వైపునుండి, తన పొలంలో కి మళ్లించే ప్రయత్నం చేసి సఫలమయ్యాడు. వానదేవుడు కరుణించకపోవడంతో, గత్యంతరం లేక ఇలా చేస్తున్నానని రైతు వాపోయాడు. ఈ దృశ్యాన్ని "మన్యం మనుగడ" తన కెమెరాలో బంధించింది.
Post A Comment: