చండ్రుగొండ మండలం టీవీ ప్రతినిధి: చండ్రుగొండ మండలంలో ప్రధాన సెంటర్లో ఆదివాసీ జెండా ఆవిష్కరించడం జరిగింది.ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగామండల ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ... ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9న ఆదివాసీలను మూలవాసులుగా గుర్తించి ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతాలకు ప్రత్యేక చట్టాలు అమలు చేశారు. ఇప్పుడు జీవో నెంబర్ 3 రద్దు కావడంతో ఆదివాసులకు ఎక్కువ అన్యాయం జరుగుతుంది. అలాగే ఏజెన్సీ మండలాలలో 1/70 చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు కుంజా నాగేంద్రబాబు, బోర సురేష్, పొడియం గణేష్, మడవి రాము, వెంకటేష్, అఖిలపాక్ష నాయకులు శ్రీనివాస రావు, కేశ బోయిన నరసింహారావు, మండల ప్రెస్ అధ్యక్షులు సైదయ్య తదితరులు పాల్గొని ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జయప్రదం చేశారు.
Post A Comment: