చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండల వ్యవసాయ అధికారి మహేష్ చంద్ర ఛటర్జీ, ఏసీబీ అధికారుల వలకు చిక్కాడు. ఏసీబీ డిఎస్పి రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఫెర్టిలైజర్ షాపులు ఇన్స్పెక్షన్ చేయకుండా ఉండేందుకు ఒక్కొక్క షాపు డీలర్ నుంచి 15 వేల రూపాయలు ఇవ్వాలని, ఛటర్జీ క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేయగా, మండలంలోని ఆరు షాపులు కు చెందిన డీలర్లు గోదా సత్యం, ఎర్రం సీతారాములు, మహేష్, వెంకటరామయ్య, శంకర్ రావు, మచ్చా కుమార్ లు జులై 30వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించి కంప్లైంట్ చేశారని, సోమవారం నాడు చండ్రుగొండ మండల రైతు వేదికలోని వ్యవసాయ కార్యాలయంలో డీలర్లు గోదా సత్యం, ఎర్రం సీతారాములు, వ్యవసాయ అధికారి మహేష్ చంద్ర చటర్జీ కి 90 వేల రూపాయలు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అశ్వారావుపేట లోని ఛటర్జీ ఇంట్లో సోదాలు నిర్వహించారు.ఈ ఆపరేషన్ లో ఏసీబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రవి, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: