మన్యం టీవీ పాల్వంచ:-
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని సుగుణ గార్డెన్స్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కేరళ ఆయుర్వేద పంచకర్మ వైద్యశాలను శుక్రవారం *డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు* ప్రారంభించారు. ఈ సందర్భంగా *కొత్వాల* మాట్లాడుతూ కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయుర్వేద వైద్యం ఎంతగానో ఉపకరిస్తుంది అన్నారు. ప్రత్యేకంగా కేరళ ఆయుర్వేదంపై శిక్షణ పొంది పక్షవాతం, ఒంటి నొప్పులు, మధుమేహ వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, బరువు తగ్గింపు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, కామెర్లు, శ్వాసకోశ వ్యాధులకు ఈ వైద్యశాలలో చికిత్స చేస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో *డాక్టర్ జోమన్, టీఆర్ఎస్ నాయకులు కొత్వాల సత్యనారాయణ, మంతపురి రాజుగౌడ్, నితిన్* తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: