మన్యం టీవీ పాల్వంచ:-
కన్నతల్లి లాంటి జన్మస్థలం రుణం తీర్చుకుంటానని, పుట్టిన ఊరుని అభివృద్ధి పథంలో నడిపిస్తాననీ *కొత్తగూడెం నియోజకవర్గం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు* అన్నారు. శుక్రవారం పాత పాల్వంచలో 2.30 కోట్ల వ్యయం తో చేపట్టానున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు *వనమా* శంకుస్థాపన చేశారు. పాత పాల్వంచలో 28 లక్షల వ్యయంతో బస్టాండ్ యాకుబ్ షాప్ నుండి హై స్కూల్ వరకు, 28.5లక్షల వ్యయం తో ఆంజనేయ స్వామి గుడి నుండి కరీం కిరాణా దుకాణం వరకు,40 లక్షల వ్యయం తో హాలిఫెయిత్ కాలేజ్ వద్ద, 40 లక్షల వ్యయంతో ముర్రేడు వాగు (బంగారుజాలు ) వద్ద, 5 లక్షల వ్యయం తో గౌండ్ల బజారులో,13 లక్షల వ్యయంతో ముదిరాజ్ బజార్లో, 34 లక్షల వ్యయంతో గడియ కట్ట నుండి దమ్మపేట రోడ్డు వరకు మెటల్ రోడ్డు, 31లక్షల వ్యయంతో జ్యోతి నగర్ లో CC రోడ్లు, సిమెంట్ డ్రైన్ నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా *వనమా* మాట్లాడుతూ తన జన్మ స్థలమైన పాత పాల్వంచను అన్నీ విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. అభివృద్ధి లో తాను వెనుకంజ వేసేది లేదన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను దశలవారీగా పూర్తి చేస్తున్నానన్నారు. ప్రజలు కోరుకున్న విధంగానే *కె. సి. ఆర్* పరిపాలన చేస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమాల్లో *డీసీఎంస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, ఎమ్మార్వో స్వామి, మున్సిపల్ డి.ఈ మురళీ, ఏ.ఈ అనిల్, సానిటరీ ఇన్స్పెక్టర్ వాణి కుమారి,జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్,ఆత్మ డైరెక్టర్ కాల్వ ప్రకాష్ రావు, తెరాస నాయకులు కొత్వాల సత్యనారాయణ, ముత్యాల వీరభద్రరావు,మంతపురి రాజు గౌడ్, యస్.వి.ఆర్క్ ఆచార్యులు, మల్లెల శ్రీరామ్మూర్తి, పూసల విశ్వనాధం,మేదరిమెట్ల వెంకటేశ్వరరావు, కాల్వ భాస్కర్, దాసరి నాగేశ్వరరావు, ముత్యాల రమణమూర్తి,ముత్యాల ప్రవీణ్,బేతంశెట్టి విజయ్,కందుకూరి రాము,చింతా నాగరాజు,చిరంజీవి,సాధం రామకృష్ణ రావు, ఏనుగుల శ్రీను,బొందిలి రాంబాబు,ఫరీద్,పుప్పాలవెంకటే శ్వర్లు ( బాబు ), హరి సత్యనారాయణ* తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: