CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పలు సమస్యలపై పంచాయతీ రాజ్ మినిస్టర్ యర్రబల్లి దయాకర్ కి వినతి పత్రం అందజేసిన ఎంపీపీ

Share it:



 మన్యంటీవీ, అశ్వారావుపేట:

 తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మినిస్టర్ యర్రబల్లి దయాకర్ ఈ రోజు అశ్వారావుపేట లో పర్యటన లో భాగంగా అశ్వారావుపేట  మండలంలోని నారంవారిగుడెం, గ్రామ పంచాయతీ లో వున్న ఆయిల్ ఫామ్ నర్సరీ సందర్శనకు విచ్చేసిన మినిస్టర్ యర్రబల్లి దయాకర్కి ఘన స్వాగతం పలికి అయనను మర్యాద పూర్వకంగా కలసి శాలువాతో సత్కరించి మెమెంటో అందజేసి, అశ్వారావుపేట మండలంలోని పలు సమస్యలు పై ఆయనకు వినతి పత్రాన్ని అందజేసిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. దానికి ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని చెప్పిన యర్రబల్లి దయాకర్ రెడ్డి. అనతరం ఆయిల్ ఫామ్ నర్సరీ వద్ద మొక్క నాటి నీళ్ళు పోశారు. ఈ కార్యక్రమంలో ఆయన తో ఉప ముఖ్యమంత్రి తాటి కొండ రాజయ్య, అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మరియు జిల్లా అధికారులు అశ్వారావుపేట జెడ్పీటీసీ చిన్నం శెట్టి వరలక్ష్మీ, తెరాస పార్టి మండల అధ్యక్షులు బండి పుల్లారావు, కార్యదర్శి బండారు శ్రీను, అశ్వారావుపేట సర్పంచ్ అట్టం రమ్య, నారంవారిగుడెం సర్పంచ్ నారం రాధ, సొసైటీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, నారాయణ పురం రైతు కమిటీ మెంబర్ చిన్నం శెట్టి వెంకట నరసింహం మరియు మండల నాయకులు, ఎంపీపీ లు జెడ్పీటీసీ లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: